
మనసును చదవగలవారే మనుషులు ... మిగిలినవి మృగాలు
బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని. మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి. ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ... భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను... ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి